Amaravati Prajarajadhani @[email protected]
219 subscribers - no pronouns :c
in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c
తుళ్లూరులోని ఏపీ సిఆర్డిఏ కార్యాలయంలో జూన్ 6వ తేదీ శుక్రవారం గ్రీవెన్స్ డే జరిగింది. అసైన్డ్ భూముల సమస్యలకు సంబంధించి, రిటర్నబుల్ ప్లాట్ల వీధిపోటు సమస్యల గురించి పలువురు రాజధాని ప్రాంతవాసులు తమ అర్జీలను "గ్రీవెన్స్ డే"లో సిఆర్డీఏ అదనపు కమిషనర్ జి.సూర్యసాయి ప్రవీణ్ చంద్ ఐఏఎస్ గారికి విన్నవించారు. అసైన్డ్ భూముల రైతులు అందజేసిన అర్జీలపై ప్రభుత్వ ఆదేశానుసారం చర్యలు తీసుకుని ప్రాధాన్యతాక్రమంలో పరిష్కరిస్తామని అదనపు కమిషనర్ గారు అర్జీదారులకు తెలియజేశారు. వీధిపోటు గురించి ఇచ్చిన అర్జీలను సిఆర్డిఏ ప్లానింగ్ విభాగం వారికి పంపించి పరిష్కరిస్తామని అదనపు కమిషనర్ గారు అర్జీదారులకు తెలియజేశారు.
✅సిఆర్డీఏలోని వివిధ విభాగాల అధికారులు గ్రీవెన్స్ డేకు హాజరై రాజధాని రైతులు అందజేసిన ఫిర్యాదులలో అధిక శాతం అక్కడికక్కడే పరిష్కారం చూపారు. తక్కినవి వెంటనే పరిష్కరించాలని, సమస్యలు పరిష్కరించటంలో అలసత్వం వద్దని అదనపు కమిషనర్ గారు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగే గ్రీవెన్స్ డేను రైతులు వినియోగించుకోవాలని ఆయన కోరారు. గ్రీవెన్స్ డేలో 23 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు.
✅గ్రీవెన్స్ డేలో వచ్చిన ఫిర్యాదులు ఇవి:
1.అమరావతిలో భూమి వ్యవహారాలు = 18
2.సామాజిక సంక్షేమం= 1
3. కార్యాలయ నిర్వహణ= 1
4. ప్లానింగ్ విభాగం= 3
✅గ్రీవెన్స్ డేలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు బి. సాయి శ్రీనివాస నాయక్, ఎం.శేషిరెడ్డి, కే.ఎస్.భాగ్యరేఖ, పి. పద్మావతి, ఏ.జి.చిన్ని కృష్ణ, కె.స్వర్ణమేరీ, జి. భీమారావు, సిఆర్డిఏ డీసీడీఓ బొర్రా శ్రీనివాసరావు, తహసీల్దార్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. #APCRDAInitiatives #GrievanceDay #PeoplesCapital #PrajaRajadhani #Amaravati #APCRDA @NaraChandrababuNaiduofficial @DrPonguruNarayana @WorldBank @AsianDevelopmentBank
Follow us on
✨Instagram - https://instagram.com/prajarajadhani
✨Facebook - https://facebook.com/PrajaRajadhani
✨LinkedIn - https://www.linkedin.com/company/prajarajadhani-amaravati/
✨Official Website - https://crda.ap.gov.in
✨X- https://x.com/PrajaRajadhani
3 - 0
విజయవాడలోని ఏపీ సిఆర్డిఏ కార్యాలయంలో 2025 జూన్ 5వ తేదీ "ప్రపంచ పర్యావరణ దినోత్సవ" కార్యక్రమం నిర్వహించడం జరిగింది. "BEAT Plastic Pollution" ఇతివృత్తంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో సిఆర్డిఏ కమిషనర్ కె.కన్నబాబు ఐఏఎస్ గారు, అదనపు కమిషనర్లు మల్లారపు నవీన్ ఐఏఎస్ గారు, జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ ఐఏఎస్ గారు సిఆర్డిఏ కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం..సిఆర్డిఏ అధికారులు, సిబ్బందితో డైరెక్టర్(ఆఫీస్ మేనేజ్మెంట్) వల్లభనేని శ్రీనివాసరావు గారు స్వచ్ఛ హరితాంధ్ర అభివృద్ధికి తోడ్పడతానని ప్రతిజ్ఞ చేయించారు.
✅అదనపు కమిషనర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ ఐఏఎస్ గారు మాట్లాడుతూ..ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. దైనందిన జీవితంలో మానవాళి వినియోగించే ప్లాస్టిక్..ఇతర జీవుల మనుగడను దెబ్బ తీస్తోందన్నారు. ప్లాస్టిక్ తదితర ఘనవ్యర్థాలు తినడం వల్ల ఆవులు, ఇతర జీవులు మరణానికి చేరువ అవుతున్నాయన్నారు. మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు నిబద్ధతతో కృషి చేయాలన్నారు.
✅అదనపు కమిషనర్ మల్లారపు నవీన్ ఐఏఎస్ గారు మాట్లాడుతూ..మానవాళి మనుగడకు ముప్పుగా పరిణమిస్తున్న ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా అందుబాటులో ఉన్న వస్తువులను వినియోగించేందుకు ప్రజలంతా ముందుకు రావాలన్నారు.
✅ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని "BEAT Plastic Pollution" థీమ్తో సిఆర్డిఏ, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్(ఏడిసిఎల్), PgMC విభాగం సిబ్బంది పిల్లలకు సిఆర్డిఏలోని పర్యావరణ, సామాజిక అభివృద్ధి విభాగం(ESMU) ఆధ్వర్యంలో పోస్టర్ మేకింగ్, వ్యాసరచన పోటీలను నిర్వహించడం జరిగింది. ఈ పోటీలలో విజేతలుగా నిలిచిన బాలలకు సిఆర్డిఏ అదనపు కమిషనర్లు మల్లారపు నవీన్ ఐఏఎస్ గారు, జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ ఐఏఎస్ గారు బహుమతులు అందజేశారు. బహుమతులతో పాటు మొక్కలు, విత్తన బంతులను బాలలకు అందజేశారు. సిఆర్డిఏ ల్యాండ్స్కేప్ & ఎన్విరాన్మెంట్ విభాగానికి చెందిన అడిషనల్ డైరెక్టర్- హార్టికల్చర్(FAC) ఎం.హరిప్రసాద్, అసిస్టెంట్ కన్వర్జర్ ఆఫ్ ఫారెస్ట్ పి. భగవాన్ నారాయణ కుమార్, ESMU విభాగానికి చెందిన KVK చైతన్య, జి. మహేశ్ బాబు, జి. రాఘవేంద్ర, OHS విభాగానికి చెందిన వి.హరికృష్ణ, వి.ప్రదీప్, యు. పాల్ సుధాకర్, ఎం.అహరోన్ పాల్ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. కార్యక్రమంలో సిఆర్డిఏలోని వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొని పర్యావరణ పరిరక్షణకు చిత్తశుద్ధితో కృషి చేస్తామని సంతకాలు చేశారు. #PeoplesCapital #PrajaRajadhani #Amaravati #APCRDA #APCRDAInitiatives #AndhraPradesh #WorldEnvironmentDay @NaraChandrababuNaiduofficial @DrPonguruNarayana @WorldBank @AsianDevelopmentBank
Follow us on
✨Instagram - https://instagram.com/prajarajadhani
✨Facebook - https://facebook.com/PrajaRajadhani
✨LinkedIn - https://www.linkedin.com/company/prajarajadhani-amaravati/
✨Official Website - https://crda.ap.gov.in
✨X- https://x.com/PrajaRajadhani
2 - 0
ప్రజారాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్లను కేటాయించేందుకు
ఈ- లాటరీ కార్యక్రమం జూన్ 5, 2025న విజయవాడలోని ఏపీ సిఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో జరిగింది.
ఆన్లైన్ ర్యాండమ్ సిస్టం ఆధారంగా ఈ- లాటరీ విధానంలో 116 మంది రైతులకు 294 ప్లాట్లను కేటాయించడం జరిగింది. ప్లాట్లకు సంబంధించిన ప్రొవిజనల్ అలాట్మెంట్ పత్రాలను రాజధాని రైతులకు సిఆర్డీఏ అధికారులు అందజేశారు. #PeoplesCapital #PrajaRajadhani #Amaravati #APCRDA #LandPooling #LPS #AndhraPradesh @NaraChandrababuNaiduofficial @DrPonguruNarayana @WorldBank @AsianDevelopmentBank
Follow us on
✨Instagram - https://instagram.com/prajarajadhani
✨Facebook - https://facebook.com/PrajaRajadhani
✨LinkedIn - https://www.linkedin.com/company/prajarajadhani-amaravati/
✨Official Website - https://crda.ap.gov.in
✨X- https://x.com/PrajaRajadhani
3 - 0
📢 APCRDA - ESMU: Environmental Clearance for Amaravati Capital City
We are inviting Expressions of Interest (EOI) for the engagement of a consultant to prepare a Comprehensive Disaster Risk Management and Resilience Plan (CDRM & RP) for the Amaravati Capital City area, Andhra Pradesh.
🏢 We welcome all eligible and experienced companies/firms to participate in this important initiative.
📄 Access the complete details here:
🔗https://crda.ap.gov.in/APCRDAV2/Views/NotificationsView.aspx
Let’s work together to build a greener, safer, and more sustainable Amaravati and Andhra Pradesh. 🌱🏙️
#Amaravati #PrajaRajadhani #PeoplesCapital #AmaravatiSmartCity #APCRDA #APCRDAInitiatives @NaraChandrababuNaiduofficial @DrPonguruNarayana @WorldBank @AsianDevelopmentBank
Follow us on
✨Instagram - https://instagram.com/prajarajadhani
✨Facebook - https://facebook.com/PrajaRajadhani
✨LinkedIn - https://www.linkedin.com/company/prajarajadhani-amaravati/
✨X- https://x.com/PrajaRajadhani
1 - 0
రాజధాని అమరావతిలోని మంగళగిరి నియోజకవకర్గ పరిధిలో అభివృద్ధి పనుల పురోగతిపై మంత్రి నారా లోకేశ్..2025 జూన్ 2వ తేదీన ఉండవల్లి నివాసంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో సిఆర్డిఏ కమిషనర్ కె. కన్నబాబు ఐఏఎస్, గుంటూరు జిల్లా ఇంఛార్జ్ కలెక్టర్ భార్గవ్ తేజ ఐఏఎస్, తెనాలి సబ్ కలెక్టర్ శ్రీమతి సంజనా సిన్హా ఐఏఎస్, ఎంటీఎంసీ కమిషనర్ అలీం బాషా, ఏడీసీఎల్ సీఈ ప్రభాకర్, మంగళగిరి సీపీడీసీఎల్ ఏడీఈఈ సురేష్ బాబు, ఆర్ & బీ సీఈ శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ సీఈ ఎమ్.రాజేంద్ర ప్రసాద్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
✅అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీకి అవసరమైన చర్యలు తీసుకోవాలని, రైల్వే, కాలువ, అటవీ, దేవాదాయ భూముల విషయంలో నెలకొన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని లోకేశ్..సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళగిరిలో యూ1, ఐ2 జోన్లు, భవన నిర్మాణ అనుమతులు ఏపీ సిఆర్డిఏ నుంచి ఎంటీఎంసీకి బదిలీ చేసే అంశంపై ఈ సమావేశంలో చర్చించారు.
✅మంగళగిరిలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న భూగర్భ డ్రైనేజీ, స్టోమ్ వాటర్ డ్రైన్స్, తాగునీరు, అండర్ గ్రౌండ్ గ్యాస్, పవర్ ప్రాజెక్టులపైనా సమావేశంలో చర్చించారు. ఆగష్టు నాటికి ఆయా ప్రాజెక్టుల డీపీఆర్లను పూర్తిచేసి అన్ని పనులు ఒకేసారి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి లోకేశ్ ఆదేశించారు. నిధుల సమీకరణపై సమావేశంలో చర్చించారు.
✅మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అభివృద్ధికి రూపొందించిన ప్రణాళికలపై జరిగిన చర్చలో డిజైన్లను పకడ్బందీగా తయారుచేయాలని మంత్రి లోకేశ్ ఆదేశించారు.
✅పీఎం సూర్యఘర్ పథకం అమలుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ పథకం కింద 37వేల దరఖాస్తులు వచ్చాయని అధికారులు ఆయనకు వివరించారు. లబ్ధిదారులకు అవసరమైన రుణ సదుపాయం కోసం బ్యాంకర్లతో సమావేశం నిర్వహించాలని ఆదేశించారు.
✅రాజధాని అమరావతికి సమీపంలో నిత్యం రద్దీగా ఉండే రహదారులలో ఒకటైన మంగళగిరి-తెనాలి- నారాకోడూరు మధ్య రహదారి నిర్మాణ పనులను త్వరగా ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. జూలై 15 నాటికి డీపీఆర్ సిద్ధం అవుతుందని, ఈ ఏడాది నవంబర్లో పనులు ప్రారంభించనున్నట్లు ఈ సందర్భంగా అధికారులు మంత్రికి వివరించారు. రోడ్డు నిర్మాణానికి సంబంధించి అధికారులు రూపొందించిన వివిధ ప్రణాళికలను మంత్రి లోకేశ్ క్షుణ్ణంగా పరిశీలించారు. గుంటూరు- బాపట్ల రహదారి నిర్మాణంపైనా సమావేశంలో ఆయన చర్చించారు.
✅చినకాకాని ఐటీ పార్క్, మోడల్ స్కూల్గా నిడమర్రు ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి, మంగళగిరిలో వీవర్స్ శాల, పార్క్ల అభివృద్ధి, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ అంశాలతో పాటు పెనుమాక, మంగళగిరి, దుగ్గిరాలలో సాంఘిక సంక్షేమ హాస్టళ్ల నిర్మాణం, నియోజకవర్గ వ్యాప్తంగా కమ్యూనిటీ భవనాలు, అంగన్వాడీ కేంద్రాల నిర్మాణంపైనా సమావేశంలో చర్చించారు. అంగన్వాడీ కేంద్రాల నిర్మాణాలను వేగంగా పూర్తిచేయాలని ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ ఆదేశించారు.
#Amaravati #PrajaRajadhani #PeoplesCapital #AmaravatiSmartcity #Mangalagiri #APCRDA #AndhraPradesh @NaraChandrababuNaiduofficial @DrPonguruNarayana @naralokeshofficial @WorldBank @AsianDevelopmentBank
Follow us on
✨Instagram - https://instagram.com/prajarajadhani
✨Facebook - https://facebook.com/PrajaRajadhani
✨LinkedIn - https://www.linkedin.com/company/prajarajadhani-amaravati/
✨Official Website - https://crda.ap.gov.in
✨X- https://x.com/PrajaRajadhani
1 - 0
మౌలిక సదుపాయాలలో మేటి - మన ప్రజారాజధాని అమరావతి! #Amaravati #PeoplesCapital #PrajaRajadhani #AmaravatiSmartcity #APCRDA #AndhraPradesh #ManaAmaravati @NaraChandrababuNaiduofficial @DrPonguruNarayana @WorldBank @AsianDevelopmentBank
Follow us on
✨Instagram - https://instagram.com/prajarajadhani
✨Facebook - https://facebook.com/PrajaRajadhani
✨LinkedIn - https://www.linkedin.com/company/prajarajadhani-amaravati/
✨Official Website - https://crda.ap.gov.in
✨X- https://x.com/PrajaRajadhani
1 - 0
దేశంలోనే మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటింగ్ హబ్ మన ప్రజారాజధాని అమరావతిలో ఏర్పాటుకానుంది!
IBM, TCS, L&T వంటి ప్రఖ్యాత సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది.
అమరావతిని పరిశోధనలు, ఆవిష్కరణల కేంద్రంగా మార్చే దిశగా గొప్ప ముందడుగు పడింది! #Amaravati #QuantumValley #QuantumComputing #InnovationHub #PrajaRajadhani #PeoplesCapital #Andhrapradesh #APCRDA @NaraChandrababuNaiduofficial @DrPonguruNarayana @WorldBank @AsianDevelopmentBank
Follow us on
✨Instagram - https://instagram.com/prajarajadhani
✨Facebook - https://facebook.com/PrajaRajadhani
✨LinkedIn - https://www.linkedin.com/company/prajarajadhani-amaravati/
✨Official Website - https://crda.ap.gov.in
✨X- https://x.com/PrajaRajadhani
2 - 0
ప్రజారాజధాని అమరావతి– ప్రతి అడుగులో ప్రణాళిక, ప్రతి మూలన బహుముఖ అభివృద్ధి! #Amaravati #PrajaRajadhani #PeoplesCapital #AndhraPradesh #AmaravatiSmartcity #APCRDA @NaraChandrababuNaiduofficial @DrPonguruNarayana @WorldBank @AsianDevelopmentBank
Follow us on
✨Instagram - https://instagram.com/prajarajadhani
✨Facebook - https://facebook.com/PrajaRajadhani
✨LinkedIn - https://www.linkedin.com/company/prajarajadhani-amaravati/
✨Official Website - https://crda.ap.gov.in
✨X- https://x.com/PrajaRajadhani
0 - 0
తుళ్లూరులోని ఏపీ సిఆర్డిఏ కార్యాలయంలో మే 30వ తేదీ శుక్రవారం గ్రీవెన్స్ డే నిర్వహించడం జరిగింది. నెగోషియేటెడ్ సెటిల్మెంట్ పాలసీ(NSP) సంబంధిత అంశాలు, గ్రామకంఠం, అసైన్డ్ భూములకు సంబంధించిన రైతులు, పారిశుధ్య కార్మికుల సమస్యలు తదితర అంశాల గురించి పలువురు రైతులు, రాజధాని ప్రాంతవాసులు "గ్రీవెన్స్ డే"లో సిఆర్డీఏ అదనపు కమిషనర్ జి.సూర్యసాయి ప్రవీణ్ చంద్ ఐఏఎస్ గారికి అర్జీలు సమర్పించారు.
✅తుళ్లూరు ప్రాంతానికి చెందిన పలువురు అర్జీదారులు నెగోషియేటెడ్ సెటిల్మెంట్ పాలసీ(NSP) కింద నివాసగృహాలు కోల్పోతున్న తమకు న్యాయం చేయాలని కోరగా..అదనపు కమిషనర్ గారు వారి ఫిర్యాదుకు పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు.
✅రాజధాని ప్రాంతంలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల వేతనాలు పెంచాలని CITU నేతలతో కలసి అర్జీ అందజేయగా..త్వరలో రాజధాని ప్రాంత పారిశుధ్య కార్మికుల వేతనం రూ.15 వేలకు పెంచి, వారికి రాజధాని ప్రాంత పేదలకు అందజేసే పింఛన్ లబ్ధిని చేకూర్చే అంశాన్ని పరిశీలిస్తామని అదనపు కమిషనర్ గారు హామీ ఇచ్చారు.
✅గ్రామకంఠం, అసైన్డ్ భూముల(కేటగిరీ- 4) రైతులు అందజేసిన అర్జీలపై ప్రభుత్వ ఆదేశానుసారం చర్యలు తీసుకుంటామని అదనపు కమిషనర్ గారు అర్జీదారులకు తెలియజేశారు.
✅ఏపీ సిఆర్డీఏలోని వివిధ విభాగాల అధికారులు గ్రీవెన్స్ డేకు హాజరై వచ్చిన అర్జీలలో అధిక శాతం అక్కడికక్కడే పరిష్కారం చూపారు. తక్కినవి వెంటనే పరిష్కరించాలని, సమస్యలు పరిష్కరించటంలో అలసత్వం వద్దని అదనపు కమిషనర్ గారు అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగే గ్రీవెన్స్ డేను రైతులు వినియోగించుకోవాలని ఆయన కోరారు. గ్రీవెన్స్ డేలో 34 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు.
✅గ్రీవెన్స్ డేలో వచ్చిన ఫిర్యాదులు ఇవి:
1.అమరావతిలో భూమి వ్యవహారాలు = 31
2.సామాజిక సంక్షేమం = 2
3.ల్యాండ్స్(సర్వే)= 1
✅గ్రీవెన్స్ డేలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు జి. రవీందర్,
బి. సాయి శ్రీనివాస నాయక్, ఎం.శేషిరెడ్డి, కే.ఎస్.భాగ్యరేఖ,
పి. పద్మావతి, ఏ.జి.చిన్ని కృష్ణ, కె.స్వర్ణమేరీ, జి. భీమారావు, జీ.ఆర్.ఎం నోడల్ అధికారి పి.జయశ్రీ, సిఆర్డిఏ డీసీడీఓ బొర్రా శ్రీనివాసరావు, అసిస్టెంట్ డైరెక్టర్(సర్వే) జి. పాండురంగారావు రామకృష్ణన్, తహసీల్దార్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
#APCRDAInitiatives #GrievanceDay #PeoplesCapital #PrajaRajadhani #Amaravati #APCRDA @NaraChandrababuNaiduofficial @DrPonguruNarayana @WorldBank @AsianDevelopmentBank
Follow us on
✨Instagram - https://instagram.com/prajarajadhani
✨Facebook - https://facebook.com/PrajaRajadhani
✨LinkedIn - https://www.linkedin.com/company/prajarajadhani-amaravati/
✨Official Website - https://crda.ap.gov.in
✨X- https://x.com/PrajaRajadhani
4 - 0
ప్రజారాజధాని అమరావతి నిర్మాణ పనులు పెద్ద ఎత్తున జరుగుతున్నందున రాజధాని ప్రాంతంలో భద్రత ఏర్పాట్లు, శాంతిభద్రతల పర్యవేక్షణకై 2025, మే 29న విజయవాడలోని ఏపీ సిఆర్డిఏ కార్యాలయంలో గుత్తేదారు సంస్థల ప్రతినిధులతో సమన్వయ సమావేశం జరిగింది. సమావేశంలో సిఆర్డిఏ అదనపు కమిషనర్ జి.సూర్యసాయి ప్రవీణ్ చంద్ ఐఏఎస్, గుంటూరు జిల్లా ఎస్పీ ఎస్. సతీశ్ కుమార్ ఐపీఎస్, గుంటూరు జిల్లా ఫైర్ అధికారి శ్రీనివాసరెడ్డి, సిఆర్డిఏ ఈఎన్సీ ఆర్. గోపాలకృష్ణారెడ్డి, అడిషనల్ ఎస్పీ(లా అండ్ ఆర్డర్) ATV రవికుమార్, రాజధాని ప్రాంతంలోని పోలీస్ స్టేషన్ల అధికారులు హాజరయ్యారు.
సమావేశంలో జి.సూర్యసాయి ప్రవీణ్ చంద్ గారు..రాజధాని ప్రాంతంలో శాంతిభద్రతల పర్యవేక్షణ, కార్మికుల భద్రతకై ఎస్పీ ఎస్. సతీశ్ కుమార్, ఇతర పోలీస్ అధికారులు తెలియజేసిన అంశాలపై సిఆర్డిఏ, అమరావతి అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్(ADCL) అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. కార్మికుల భద్రతకు సంబంధించి నిర్దేశించిన నిబంధనలన్నీ రాజధానిలో నిర్మాణ పనులు చేపట్టిన గుత్తేదారు సంస్థలు పాటించాలని ఆదేశించారు. బాలకార్మికులు, లింగవివక్షకు రాజధాని నిర్మాణ పనులలో తావు లేదని అదనపు కమిషనర్ గారు స్పష్టం చేశారు. పోలీస్, అగ్నిమాపక శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ సిఆర్డిఏ, ఏడీసీఎల్ అధికారులు, సిఆర్డిఏలోని ప్రోగ్రాం మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ(PgMC), ప్రాజెక్టు మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ(PMC) సిబ్బంది పనిచేయాలని ఆదేశించారు.
#PeoplesCapital #PrajaRajadhani #AndhraPradesh #APCRDA #APCRDAInitiatives @NaraChandrababuNaiduofficial @DrPonguruNarayana @WorldBank @AsianDevelopmentBank
Follow us on
✨Instagram - https://instagram.com/prajarajadhani
✨Facebook - https://facebook.com/PrajaRajadhani
✨LinkedIn - https://www.linkedin.com/company/prajarajadhani-amaravati/
✨Official Website - https://crda.ap.gov.in
✨X- https://x.com/PrajaRajadhani
1 - 0