Channel Avatar

YASHASWINI REDDY @[email protected]

85K subscribers - no pronouns :c

Mamidala Yashaswini Reddy is an Indian politician from the s


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

YASHASWINI REDDY
Posted 59 minutes ago

31 - 0

YASHASWINI REDDY
Posted 3 hours ago

పెరికవేడు గ్రామంలో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన గ్రామాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం – ఎమ్మెల్యే శ్రీమతి యశస్విని రెడ్డి గారు..*

వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని పెరికవేడు గ్రామంలో, CRR నిధుల నుండి ₹5 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించబోయే సీసీ రోడ్డు పనుల ప్రారంభానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని పాలకుర్తి శాసనసభ్యురాలు శ్రీమతి యశస్విని రెడ్డి గారు శనివారం నాడు నిర్వహించారు..

ఈ సందర్భంగా గ్రామంలో భూమిపూజ చేసి, పనులను వేగంగా, నాణ్యతతో పూర్తిచేయాలని అధికారులను ఆమె ఆదేశించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు..

ఈ సందర్భంగా *ఎమ్మెల్యే శ్రీమతి యశస్విని రెడ్డి గారు మాట్లాడుతూ..* గ్రామ ప్రజలు ఇబ్బందులు పడుతున్న ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణం అత్యవసరం. ఇది కేవలం అభివృద్ధి పనుల ప్రారంభం మాత్రమే కాదు, ప్రజలకు సౌకర్యాల పునాది కూడా. వర్షాకాలంలో జారే మట్టి రోడ్ల సమస్య ఇకదాటి వెళ్లేలా చూస్తాం. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ ప్రతి గ్రామాన్ని నూతనంగా తీర్చిదిద్దే దిశగా ముందుకు సాగుతున్నాం, అని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు..

గ్రామస్థులు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ రోడ్డు గ్రామానికి ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమం అభివృద్ధి పట్ల ప్రభుత్వ నిబద్ధతకు ప్రతీకగా నిలిచింది..

17 - 0

YASHASWINI REDDY
Posted 3 hours ago

కొత్తూరు గ్రామంలో సీసీ రోడ్డు మరియు అంగన్వాడీ భవన నిర్మాణానికి శంకుస్థాపన పిల్లల భవిష్యత్తు, ప్రజల అవసరాలపై దృష్టి – ఎమ్మెల్యే శ్రీమతి యశస్విని రెడ్డి గారు..*

వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని కొత్తూరు గ్రామంలో, CRR నిధుల నుండి ₹10 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు, మరియు ₹12 లక్షల రూపాయల వ్యయంతో అంగన్వాడీ భవన నిర్మాణ పనుల ప్రారంభానికి భూమిపూజ, శంకుస్థాపన కార్యక్రమాన్ని పాలకుర్తి శాసనసభ్యురాలు శ్రీమతి యశస్విని రెడ్డి గారు శనివారం నిర్వహించారు..

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు, అధికారులు పాల్గొన్నారు. గ్రామ వాతావరణం ఉత్సాహంగా మారింది..

ఈ సందర్భంగా *ఎమ్మెల్యే శ్రీమతి యశస్విని రెడ్డి గారు మాట్లాడుతూ..* ఒక గ్రామ అభివృద్ధికి మౌలిక వసతులు ఎంత ముఖ్యమో, పిల్లల ఆరోగ్యానికి, విద్యాభివృద్ధికి అంగన్వాడీ కేంద్రాల పాత్ర అంతే ముఖ్యమైనది. కూతురు గ్రామానికి సీసీ రోడ్డు, అంగన్వాడీ భవన నిర్మాణం వంటి పనులు మంజూరవటం అభివృద్ధి దిశగా కీలక అడుగు. ఈ నిర్మాణాలు నాణ్యతతో, వేగంగా పూర్తవ్వాలని అధికారులను ఆదేశించాం. సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గ్రామీణ ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తున్నాం. పాలకుర్తి నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని మోడల్ గ్రామంగా తీర్చిదిద్దే సంకల్పంతో పనిచేస్తున్నాను," అని వారు తెలిపారు..

గ్రామ ప్రజలు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని స్వాగతించారు. చిన్నారుల కోసం అంగన్వాడీ నిర్మాణానికి శంకుస్థాపన కావడం పట్ల గ్రామ మహిళలు హర్షం వ్యక్తం చేశారు.
ఈ అభివృద్ధి కార్యక్రమాలు గ్రామానికి కొత్త ఊపును తీసుకువచ్చాయి..

33 - 0

YASHASWINI REDDY
Posted 3 hours ago

154 - 0

YASHASWINI REDDY
Posted 3 hours ago

*బంధనపల్లి గ్రామంలో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన – బాధిత నాయకుని పరామర్శించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు గ్రామ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం – ఎమ్మెల్యే శ్రీమతి యశస్విని రెడ్డి గారు..*

వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని బంధనపల్లి గ్రామంలో CRR నిధుల ద్వారా మంజూరైన ₹5 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించబోయే సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన కార్యక్రమాన్ని పాలకుర్తి శాసనసభ్యురాలు శ్రీమతి యశస్విని రెడ్డి గారు శుక్రవారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు గ్రామ ప్రజలతో కలిసి భూమిపూజ నిర్వహించి అభివృద్ధి పనులకు నాంది పలికారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, గ్రామస్థులు కార్యక్రమంలో పాల్గొన్నారు..

ఈ సందర్భంగా *ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ..* ప్రతి గ్రామానికి తగిన మౌలిక వసతులు కల్పించడం ద్వారా గ్రామీణ ప్రాంత అభివృద్ధిని వేగవంతం చేయాలి. సిఆర్ఆర్ నిధుల ద్వారా జగన్నదపల్లిలో చేపట్టిన సీసీ రోడ్డు పనులు, గ్రామ ప్రజల రాకపోకలలో సౌలభ్యాన్ని కలిగిస్తాయి. నాణ్యతతో, వేగంగా ఈ పనులు పూర్తవ్వాలి, అని వారు అన్నారు..

పార్టీకి సేవ చేసిన నాయకుల పట్ల నా బాధ్యతగా భావించి, వారి సంక్షేమం గురించి తెలుసుకోవడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను, అని వారు అన్నారు..

ఈ పరామర్శతో గ్రామస్థులు ఎమ్మెల్యే గారి హృదయతత్వాన్ని ప్రశంసిస్తూ, ప్రజలకు చేరువగా ఉండే నాయకత్వాన్ని అభినందించారు..

24 - 0

YASHASWINI REDDY
Posted 4 hours ago

మహబూబ్‌నగర్ గ్రామంలో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన గ్రామీణ అభివృద్ధికి సిసలైన నాంది – ఎమ్మెల్యే శ్రీమతి యశస్విని రెడ్డి గారు..*

వరంగల్ జిల్లా రాయపర్తి మండల పరిధిలోని మహబూబ్‌నగర్ గ్రామంలో, CRR నిధుల నుండి ₹5 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించబోయే సీసీ రోడ్డు పనుల ప్రారంభానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని పాలకుర్తి శాసనసభ్యురాలు శ్రీమతి యశస్విని రెడ్డి గారు శనివారం నిర్వహించారు..

ఈ సందర్భంగా వారు గ్రామ ప్రజలతో కలిసి భూమిపూజ చేసి, అభివృద్ధి పనులకు శుభారంభం చేశారు. గ్రామ ప్రజలు, స్థానిక నాయకులు, అధికారులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు..

ఈ సందర్భంగా *ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు మాట్లాడుతూ..* గ్రామ అభివృద్ధి అనేది మౌలిక వసతుల కల్పనతోనే సాధ్యమవుతుంది. రోడ్డు లాంటి వసతులు ప్రజల రాకపోకలకే కాకుండా ఆరోగ్యం, విద్య, వ్యాపార రంగాల అభివృద్ధికి కూడా ఎంతో అవసరం. CRR నిధుల ద్వారా ఈ గ్రామానికి మంజూరైన రహదారి పనులు త్వరితగతిన, నాణ్యతతో పూర్తవ్వాలని అధికారులను ఆదేశించాం..

ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి దిశానిర్దేశంలో పాలకుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే నా కర్తవ్యం, అని వారు స్పష్టంగా పేర్కొన్నారు..

ఈ కార్యక్రమం గ్రామస్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. గ్రామ ప్రజలు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టాలంటూ అభ్యర్థించారు..

32 - 0

YASHASWINI REDDY
Posted 6 hours ago

ఊకల్ గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన గ్రామీణ అభివృద్ధి పథంలో మైలురాయి – ఎమ్మెల్యే శ్రీమతి యశస్విని రెడ్డి గారు..*

వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని ఊకల్ గ్రామంలో, CRR నిధుల నుంచి మంజూరైన ₹10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించబోయే సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాలకుర్తి శాసనసభ్యురాలు శ్రీమతి యశస్విని రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొని భూమిపూజ చేశారు..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారితో పాటు మండల నాయకులు, గ్రామ నాయకులు, స్థానిక నాయకులు, అధికారులు, కాంగ్రెస్ కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు..

ఈ సందర్భంగా *ఎమ్మెల్యే శ్రీమతి యశస్విని రెడ్డి గారు మాట్లాడుతూ..* ఊకల్ గ్రామానికి సీసీ రహదారి మంజూరవడం అభివృద్ధికి నాంది. వర్షాకాలంలో మట్టి రోడ్ల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించడానికి ఈ రోడ్డు నిర్మాణం ఎంతో ఉపయోగపడుతుంది, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. పాలకుర్తి నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువచ్చేందుకు నేను కృషి చేస్తాను,"అని ఎమ్మెల్యే పేర్కొన్నారు..

గ్రామ ప్రజలు ఈ శంకుస్థాపనపై హర్షం వ్యక్తం చేస్తూ, తమ గ్రామానికి అభివృద్ధి వంతు రోడ్డు రూపంలో అందించిన ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమం గ్రామ అభివృద్ధిలో మరో ముఖ్య ఘట్టంగా నిలిచింది.

26 - 0

YASHASWINI REDDY
Posted 6 hours ago

*దేవరుప్పుల మండలంలో పల్లెబాట కార్యక్రమం – వివిధ గ్రామాలలో పాల్గొన్న టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సి రాజేందర్ రెడ్డి గారు..*

దేవరుప్పుల మండల పరిధిలోని చౌడూరు గ్రామం, రంభోజిగూడెం, నల్లకుంటా తండా గ్రామాల్లో పల్లెబాట కార్యక్రమం భాగంగా పర్యటించిన పాలకుర్తి నియోజకవర్గ ఇంచార్జ్, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి ఝాన్సి రాజేందర్ రెడ్డి గారు ప్రజలతో నేరుగా మమేకమయ్యారు. ఇంటింటికీ వెళ్లి ప్రజల అభిప్రాయాలు విని, వారి జీవితాల్లో ఎదుర్కొంటున్న సమస్యలను సమీక్షించారు..

ప్రజలు స్వాగతంతో వారిని పలకరించగా, తాగునీటి సమస్య, రహదారి అభివృద్ధి, గిరిజన సంక్షేమ పథకాలు, ఆరోగ్య సదుపాయాల కొరత వంటి పలు అంశాలు వారి దృష్టికి తీసుకువచ్చారు..

ఈ సందర్భంగా *శ్రీమతి ఝాన్సి రాజేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ..* చౌడూరు, రంభోజిగూడెం, నల్లకుంట తండా వంటి గ్రామాల్లో ప్రజల జీవనశైలి, విధానాన్ని తెలుసుకున్నారు, ప్రతి పల్లె అభివృద్ధి చెందాలి అంటే ప్రజల వంతు భాగస్వామ్యం కూడా అవసరం. మేము నాయకులుగా మీ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసేందుకు కట్టుబడి ఉన్నాం. ఈ పల్లెల అభివృద్ధి మన పార్టీ నాయికత్వంలోనే సాధ్యం.

ముఖ్యంగా పాలకుర్తి ఎమ్మెల్యే శ్రీమతి యశస్విని రెడ్డి గారు ఎంతో శ్రమతో పనిచేస్తున్నారు. ప్రజల పట్ల ఆమె చూపే కృషి, వినయం ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తోంది. చిన్న వయసులోనే ఆమె నాయకత్వంలో నియోజకవర్గం అభివృద్ధి బాటలో నడుస్తోంది అని వారు ప్రశంసించారు..

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, మహిళా సంఘాలు, యువత, పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పల్లెబాట పర్యటన ప్రజల మద్దతుతో విజయవంతంగా సాగింది..

79 - 0

YASHASWINI REDDY
Posted 9 hours ago

పోతిరెడ్డిపల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్రానికి శంకుస్థాపన పిల్లల సురక్షిత భవిష్యత్తు కోసం మౌలిక వసతుల కల్పనకు కృషి – ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు..*

వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో ₹12 లక్షల వ్యయంతో నిర్మించబోయే అంగన్వాడీ కేంద్రానికి భూమి పూజ మరియు శంకుస్థాపన కార్యక్రమాన్ని పాలకుర్తి శాసనసభ్యురాలు శ్రీమతి యశస్విని రెడ్డి గారు గురువారం నిర్వహించారు..

ఈ సందర్భంగా *ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు మాట్లాడుతూ..* అంగన్వాడీ కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లో చిన్నారుల పోషణ, విద్య, ఆరోగ్య సేవల కేంద్రాలుగా పనిచేస్తున్నాయి. ఇవి పిల్లల సురక్షిత భవిష్యత్తుకు బలమైన పునాది. పోతిరెడ్డిపల్లి గ్రామానికి కొత్తగా అంగన్వాడీ భవనం నిర్మించబోతుండడం హర్షణీయ విషయమైతే, ఈ నిర్మాణాన్ని త్వరితగతిన నాణ్యతతో పూర్తి చేయాలనే దిశగా చర్యలు తీసుకుంటున్నాం..

ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గ్రామీణ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ ప్రతి గ్రామానికి అవసరమైన మౌలిక వసతులు అందించేందుకు కృషి చేస్తున్నాం,అని ఎమ్మెల్యే గారు అన్నారు..

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళా కార్యకర్తలు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. చిన్నారుల భద్రత, ఆరోగ్య రక్షణ కోసం ఈ నిర్మాణం ఎంతో మేలు చేస్తుందని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలిపారు.

62 - 0

YASHASWINI REDDY
Posted 10 hours ago

*కొండూరు గ్రామంలో రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన పార్టీ నేతలు, కార్యకర్తల నడుమ ఉత్సాహభరితంగా పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీమతి యశస్విని రెడ్డి గారు..*

వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని కొండూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, పార్లమెంట్ సభ్యులు శ్రీ రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలు వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన పాలకుర్తి శాసన సభ్యురాలు శ్రీమతి యశస్విని రెడ్డి గారు, పార్టీ నాయకులు, కార్యకర్తల నడుమ కేక్ కట్ చేసి రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు..

ఈ సందర్భంగా *ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు మాట్లాడుతూ..* రాహుల్ గాంధీ గారు దేశానికి విశ్వసనీయత కలిగిన, ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసే నిజమైన ప్రజానాయకులు. ఆయన నాయకత్వంలో దేశంలో సామాజిక న్యాయం, సమానత్వం, ప్రజాస్వామ్యం బలపడుతున్నాయి. ఆయన జన్మదినాన్ని మనం ఈరోజు ఒక్క వేడుకగా కాదు, భావితరాలకు ఆశాజ్యోతి చూపించే ఉద్యమంగా జరుపుకుంటున్నాం..

ఈ పుణ్యదినాన్ని పురస్కరించుకొని ప్రతి కార్యకర్తలో ఆత్మవిశ్వాసం, సేవాభావం పెరగాలి. రాహుల్ గాంధీ గారి ఆశయాలు సాకారం కావాలని మనమంతా కలసి కృషి చేయాలి, అని వారు అన్నారు..

వేడుకల్లో గ్రామస్థులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన విభాగం, మహిళా విభాగం కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ వేడుకలు కాంగ్రెస్ కార్యకర్తల ఉత్సాహాన్ని పెంచుతూ, పార్టీ పట్ల భవిష్యత్ లో అంకితభావంతో పనిచేయాలని ప్రేరణనిచ్చాయి.

40 - 0